చదువుల నిలయమైన కళాశాలకు చెందిన హాస్టల్లో కిలోల కొద్ది గంజాయి పట్టుబడింది. విద్యార్థులకు మాయమాటలు చెప్పి వారి గదుల్లోనే గంజాయి కాటన్లు దాచి స్మంగ్లిగ్ కు పాల్పడుతున్న వార్డెన్ వ్యవహారం సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన సూర్యాపేటలో తీవ్ర కలకలం సృష్టించింది.

ఈ ఘటనకు సంబంధించి విద్యార్థులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సూర్యాపేట పట్టణంలో ఓ ప్రైవేట్ కళాశాల బాలుర హాస్టల్లో వార్డెన్ గా పనిచేసే ఓ వ్యక్తి గుట్టుగా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఇతడు గంజాయి ప్యాకెట్లను పరీక్ష పేపర్లని చెప్పి విద్యార్థుల గదుల్లో మంచాలకింద దాచిపెట్టాడు. అయితే అవి నిజంగానే పరీక్ష పేపర్లుగా బావించిన విద్యార్థులు రాత్రి సమయంలో ఆ కాటన్లను తెరిచారు. అయితే అందులో ప్రశ్నా పత్రాలకు బదులు గంజాయి బైటపడింది. దీంతో విద్యార్థుల సమాచారంతో కళాశాల వద్దకు చేరుకున్న విద్యార్థి సంఘాల నాయకులు ఆ గంజాయి కాటన్లను రోడ్డుపై పెట్టి ఆందోళన చేపట్టారు.

ALSO READ:  Despite Stringent Laws, The Dangerous 'Liquor Chocolates' Continue To Be The Rage In Hyderabad Markets

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్ వద్దకు చేరుకుని 12 గంజాయి కాటన్లను స్వాధీనం చేసుకున్నారు. దీంట్లో మొత్తంగా సుమారు 100 కేజీల గంజాయి ఉన్నట్లు సమాచారం. ఈ గంజాయి పాకెట్లను తీపసుకువచ్చినట్లు గా అనుమానిస్తున్న హాస్టల్ ముందున్న ఓ ఆటోను కూడా పోలీసులు సీజ్ చేశారు. ఈ గంజాయి సరఫరాపై కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. #KhabarLive