తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన వందలాది అమరవీరుల కోసం ఒక స్మారక స్థూపాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఇది హుసేన్ సాగర్ సమీపంలో వస్తున్నది. దీనికి సంబంధించిన నమూనాలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆమోదించారు.

ఈ నమూనాలను ఐటి మంత్రి కెటి రామారావు ట్వీట్ చేశారు. స్మారకనిర్మాణం దీపాకారంలో ఉంటుంది. అమరులకు నిరంతరం నివాళి అర్పిస్తున్నట్లుగా దీపం వెలుగుతూ ఉంటుంది. అమరువీరుల స్మారకాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తారు. ఆ స్మారకం దగ్గర మ్యూజియం, ఆడియో విజువల్ ఏర్పాట్లు, కోసం కన్వెన్షన్ హాల్ తో పాటు ఒక రెస్టారెంట్ కూడా ఉంటాయి. స్మారక మందిరంలో మొత్తం మూడు అంతస్తులుంటాయి. #KhabarLive

ALSO READ:  Hyderabad-Based Gold Recycling Startup DRU GOLD Opens 20th Store At Karimnagar In Telangana